Jammu And Kashmirలో ఘోర బస్సు ప్రమాదం...25మందికి గాయాలు
ABN , First Publish Date - 2022-05-28T16:26:24+05:30 IST
జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు...
జమ్మూ: జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.జమ్మూ నుంచి ఉధంపూర్ కు వస్తున్న బస్సు దోడా జిల్లా బట్టల్ బల్లియన్ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.ఈ ప్రమాద ఘటనలో గాయపడిన 25మందిని పోలీసులు ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జమ్మూ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అతివేగం వల్ల బస్సు బోల్తా పడిందని పోలీసులు చెప్పారు.