West Bengal పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్

ABN , First Publish Date - 2021-12-23T15:45:02+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లాలోని ఓ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది...

West Bengal పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్

నడియా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లాలోని ఓ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది.నడియా జిల్లాలోని ఓ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కరోనా కలకలంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు.కరోనా సోకిన విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం 6,28,454 కొవిడ్ కేసులు నమోదైనాయి. గడచిన 24 గంటల్లో 534 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఒమైక్రాన్ వేరియంట్ సోకుతోంది. దీంతో ఒమైక్రాన్ వేరియంట్ కట్టడికి పశ్చిమబెంగాల్ ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2021-12-23T15:45:02+05:30 IST