భారత్‌కు క్షమాపణలు చెప్పిన ట్విటర్‌

ABN , First Publish Date - 2020-10-30T08:16:36+05:30 IST

లేహ్‌, జమ్మూ కశ్మీర్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ట్విటర్‌ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. భారత జాయింట్‌ పార్టమెంటరీ కమిటీ ముందు వారు గురువారం హాజరయ్యారు...

భారత్‌కు క్షమాపణలు చెప్పిన ట్విటర్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 29: లేహ్‌, జమ్మూ కశ్మీర్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ట్విటర్‌ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. భారత జాయింట్‌ పార్టమెంటరీ కమిటీ ముందు వారు గురువారం హాజరయ్యారు. ఇది పూర్తిగా తమ తప్పిదమేనని, దీన్ని పునరావృతం కానివ్వమని తెలిపారు. దీనిపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ.. క్షమాపణను రాతపూర్వకంగా అందించాలని, ఈ అంశంపై ఓ అఫిడవిట్‌ను కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. 

Updated Date - 2020-10-30T08:16:36+05:30 IST