భారతీయుడికి ట్విటర్ పగ్గాలు
ABN , First Publish Date - 2021-11-30T08:18:22+05:30 IST
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో కంపెనీ ప్రధాన టెక్నాలజీ అధికారి....
కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో కంపెనీ ప్రధాన టెక్నాలజీ అధికారి, ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని ట్విటర్ వెల్లడించింది. దీంతో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థకు భారతీయుడు సీఈఓ అవుతున్నారు. కాగా డోర్సీ రాజీనామాకు కారణా లు మాత్రం తెలియలేదు. డోర్సీ ‘స్క్వేర్’ అనే ఫైనాన్షియ ల్ పేమెంట్స్ సంస్థకు కూడా సీఈఓగా ఉన్నారు. ఈ రెండు సంస్థలను సమర్ధవంతంగా నడపగలరా? అని ఇటీవల కొంతమంది మదుపరులు ప్రశ్నించడంతో డోర్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. కాగా ఐఐటీ బాంబే, స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్ధి అయిన పరాగ్..ట్విట ర్లో పదేళ్లుగా కీలకమైన విభాగాల్లో పనిచేశారు.