విజయసాయి, రఘురామ మధ్య ట్విట్టర్‌ వార్

ABN , First Publish Date - 2022-01-21T00:22:58+05:30 IST

ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య ట్విట్టర్‌ వార్ కొనసాగుతోంది. ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

విజయసాయి, రఘురామ మధ్య ట్విట్టర్‌ వార్

అమరావతి: ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య ట్విట్టర్‌ వార్ కొనసాగుతోంది. ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. దీంతో విజయసాయికి రఘురామ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


‘‘నా జీవితం నీకు, ఏ1కి భారంగా ఉందనే కదా. నన్ను కూడా వివేకానందరెడ్డిలా కడతేర్చాలనుకుంటున్నారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని.. రొచ్చులో తొక్కేరోజు దగ్గర పడింది.. ఏ2’’ అని రఘురామ హెచ్చరించారు. 


‘‘నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదా?. గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా’’ అని విజయసాయి ప్రశ్నించారు.



Updated Date - 2022-01-21T00:22:58+05:30 IST