Pathankot కంటోన్మెంటులో సిపాయి కాల్పులు...ఇద్దరు సైనికుల మృతి

ABN , First Publish Date - 2022-06-28T14:17:12+05:30 IST

పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ జిల్లాలో ఓ ఆర్మీ జవాన్ తన ఇద్దరు సహచరులను కాల్చి చంపాడు...

Pathankot కంటోన్మెంటులో సిపాయి కాల్పులు...ఇద్దరు సైనికుల మృతి

పఠాన్‌కోట్: పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ జిల్లాలో ఓ ఆర్మీ జవాన్ తన ఇద్దరు సహచరులను కాల్చి చంపాడు.పఠాన్‌కోట్ జిల్లాలోని మిర్థాల్ కంటోన్మెంట్ వద్ద సోమవారం ఓ ఆర్మీ జవాన్ తన ఇద్దరు సహచరులను కాల్చి చంపినట్లు పోలీసు అధికారి తెలిపారు.సోమవారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు హవల్దార్లపై 22 ఏళ్ల సిపాయి కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.నాలుగు సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్న సిపాయి తన సర్వీసు రివాల్వరును విడిచిపెట్టి సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. కాని తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కాల్పులకు దారితీసిన ఘటనపై ఆర్మీ, పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.


నాయక్ ర్యాంక్ ఆర్మీ అధికారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సైనికులు నిద్రిస్తున్నప్పుడు కాల్పులు వినిపించాయని పేర్కొన్నారు. ఆర్మీ అధికారి తన సహోద్యోగులతో కలిసి సంఘటన స్థలానికి వచ్చారు. కాల్పులు జరిపిన నిందితుడిపై ఐపీసీ, ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-06-28T14:17:12+05:30 IST