రెండు కార్లు ఢీ.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-07-27T06:36:00+05:30 IST

అతివేగంగా వస్తున్న కారు మరో కారును ఢీకొట్టడంతో

రెండు కార్లు ఢీ.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

  • వికారాబాద్‌ జిల్లా  పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి వద్ద ఘటన 


పూడూరు: అతివేగంగా వస్తున్న కారు మరో కారును ఢీకొట్టడంతో  ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. ఈఘటన వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టెంపల్లి గేట్‌ సమీపంలో జరిగింది. హైదరాబాద్‌ నార్సింగ్‌లో స్థిరపడిన మల్లికార్జున్‌రెడ్డి కుటుంబం ఆదివారం సాన్‌ట్రో కారు(టీఎస్‌02క్యూ4972)లో ఓవిందు నిమిత్తం తమ స్వగ్రామమైన వికారాబాద్‌జిల్లా కేంద్రం సాకేత్‌నగర్‌కు వచ్చారు. సోమవారం ఉదయం  తిరిగి  ఇంటికి వస్తుండగా, హైదరాబాద్‌ నుంచి అతివేగంగా వస్తున్న (ఏపీ05ఎఎ8685) క్వాలిస్‌ కారు పూడూరు మండలం అంగడిచిట్టెంపల్లి గేట్‌ ధరణికాటన్‌ మిల్లు సమీపంలో ఢీకొట్టింది. సాన్‌ట్రో కారులో ఉన్న ఎర్రవల్లి మల్లికార్జున్‌రెడ్డి(60), ఎర్రవల్లి రాజ్యలక్షి ్మ(56), వాళ్ల మనుమడు జవనా్‌షరెడ్డి(6) అక్కడికక్కడే మృతిచెందారు. జవనా్‌షరెడ్డి తండ్రి సంతో్‌షరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే క్వాలి్‌సలో ఉన్న మహ్మద్‌గౌస్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మహ్మద్‌గౌస్‌ కారును నిర్లక్ష్యంతో నడపడమే కాకుండా అతివేగంగా రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టడంతోనే  ప్రమా దం జరిగినట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

Updated Date - 2021-07-27T06:36:00+05:30 IST