గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-22T21:46:02+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో

గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులు నమోదు

గుడివాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. టీడీపీ నేత బోండా ఉమా ఫిర్యాదు మేరకు మంత్రి కొడాలి నాని ఓఎస్‌డి శశిభూషణ్‌పై కేసు నమోదయింది. గుడివాడ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల కుమార్‌ రాజా, నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, తంగిరాల సౌమ్య, ఆచంట సునీతపై కేసులు చేసినట్లు పోలీసులు తెలపారు. గుడివాడలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నించారని కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి, బోండా ఉమా కారు అద్దాల ధ్వంసం వ్యవహారంలో శశిభూషణ్‌పై కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2022-01-22T21:46:02+05:30 IST