TS News: వరంగల్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతం
ABN , First Publish Date - 2022-08-08T16:29:17+05:30 IST
జిల్లాలోని ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కథ సుఖంతమైంది. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్లో ఇద్దరు పిల్లల కిడ్నాప్ను పోలీసులు చేధించారు.
వరంగల్: జిల్లాలోని ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ (Kidnap) కథ సుఖంతమైంది. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్లో ఇద్దరు పిల్లల (Childrens) కిడ్నాప్ను పోలీసులు చేధించారు. మహారాష్ట్ర నాగపూర్ సమీపంలోని చంద్రపూర్ దగ్గర రేహన్(6), కిజ్రా(2) పిల్లలను గుర్తించారు. కిడ్నాప్ చేసిన నిందితుడు ఫిరోజ్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. మరికాసేపట్లో పోలీసులు చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.