Russia వాయుసేన దాడుల్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరుల మృతి

ABN , First Publish Date - 2022-03-07T16:12:13+05:30 IST

ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది...

Russia వాయుసేన దాడుల్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరుల మృతి

కీవ్ : ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది.రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో 38 మంది పిల్లలు మరణించారు. రష్యా సైనికుల దాడుల్లో మరో 71 మంది పిల్లలు గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ మానవ హక్కుల కమిషనర్ లియుడ్మిలా డెనిసోవా తెలిపారు.ఖార్కివ్ మీదుగా రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ తెలిపింది.న్యూయార్క్ నుంచి 50 మంది రష్యన్ దౌత్యవేత్తలు వారి కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ నగరం నుంచి మాస్కోకు తిరిగి వచ్చినట్లు రష్యా వార్తా సంస్థ నివేదించింది.


Updated Date - 2022-03-07T16:12:13+05:30 IST