Sonbhadra:మట్టిదిబ్బ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

ABN , First Publish Date - 2022-07-25T13:05:12+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మట్టిదిబ్బ కూలి ఇద్దరు కూలీలు మరణించారు....

Sonbhadra:మట్టిదిబ్బ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

సోన్‌భద్రా(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మట్టిదిబ్బ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఇద్దరు కూలీలు యంత్రాన్ని ఉపయోగించి మట్టిని తవ్వుతుండగా మట్టి దిబ్బ ఒక్కసారిగా కూలిపోవడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.బిల్లి మార్కుండి ప్రాంతంలో కూలీలు యంత్రంతో మట్టి తవ్వకాలు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.మెషీన్‌పై మట్టి కుప్ప కూలిపోవడంతో దాని ఆపరేటర్ సత్యేంద్ర (34), క్లీనర్ రవిశంకర్ యాదవ్ (22)లు మట్టిపెళ్లల కింద చిక్కుకుని మరణించారు.సాయంత్రం మట్టిని తీసిన తర్వాత మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మట్టి తవ్వకాలు జరిపే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  


Updated Date - 2022-07-25T13:05:12+05:30 IST