Vijayanagaram: వర్షాలకు గోడ కూలి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-09T13:58:49+05:30 IST

జిల్లాలోని గరివిడి మండలం కుమరాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Vijayanagaram: వర్షాలకు గోడ కూలి ఇద్దరు మృతి

విజయనగరం: జిల్లాలోని గరివిడి మండలం కుమరాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అర్ధరాత్రి గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అడ్డాల హరిషిత్ వర్మ, అడ్డాల లక్ష్మిగా గుర్తించారు. మృతదేహాలను వెలికితీసిన స్థానికులు... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-09T13:58:49+05:30 IST