వధువు ఇంటికి వరుడు చేరుకున్న మరుక్షణంలోనే ఊహించని ఘటన.. ఇద్దరు మృతి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-22T17:07:01+05:30 IST

మరికొద్ది గంటల్లో పెళ్లి జరగబోతోంది.. అంతా కోలాహలంగా ఉంది.. వివాహ వేడుక కోసం వధువు ఇంటికి వరుడు చేరుకున్నాడు..

వధువు ఇంటికి వరుడు చేరుకున్న మరుక్షణంలోనే ఊహించని ఘటన.. ఇద్దరు మృతి.. అసలేం జరిగిందంటే..

మరికొద్ది గంటల్లో పెళ్లి జరగబోతోంది.. అంతా కోలాహలంగా ఉంది.. వివాహ వేడుక కోసం వధువు ఇంటికి వరుడు చేరుకున్నాడు.. వరుడిని చూసేందుకు వధువు తరఫు వారందరూ మొదటి అంతస్థులోని బాల్కనీలోకి చేరుకున్నారు.. భారం ఎక్కువ కావడంతో ఆ బాల్కనీ కూలిపోయింది.. దీంతో అందరూ కింద పడిపోయారు.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో  ఈ ఘటన జరిగింది. 


లక్నోకు సమీపంలోని నూర్దిఖేడా గ్రామానికి చెందిన బాబులాల్ కుమార్తె మనీషాకు జలీం ఖేడాలో నివాసముంటున్న వివేక్‌తో వివాహం కుదిరింది. వివాహ వేడుక కోసం వధువు మనీషా ఇంటికి వరుడు చేరుకున్నాడు. ఆ సమయంలో వరుడిని చూసేందుకు బాబూ లాల్ ఇంటి బాల్కనీ మీదకు పెద్ద సంఖ్యలో బంధువులు వెళ్లారు. అంత భారం తట్టుకోలేక ఆ బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అందరూ మొదటి అంతస్థు నుంచి కింద పడిపోయారు. 


ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఆ బాల్కనీ కింద నిల్చున్నవారు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. చుట్టుపక్కల వారు శిథిలాల కింద నుంచి ఒక్కొక్కరినీ బయటకు లాగా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించిన వారిని లోక్ బంధు ఆసుపత్రికి చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-22T17:07:01+05:30 IST