సైకిల్‌ను ఢీ కొట్టిన ట్రాలీ

ABN , First Publish Date - 2021-03-01T06:47:15+05:30 IST

సైకిల్‌ను ఢీ కొట్టిన ట్రాలీ

సైకిల్‌ను ఢీ కొట్టిన ట్రాలీ
మర్రిమిట్ట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరయ్య

భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు


గూడూరు రూరల్‌, ఫిబ్రవరి 28 : గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం బొలెరో ట్రాలీ వాహనం సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తకు తీవ్రగాయాలై భర్త ఆస్పత్రిలో  చనిపోగా భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. మండలంలో అయోధ్యపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్‌ పడిగే వీరయ్య(50), అతడి భార్య పకృత ప్రస్తుతం వార్డు సభ్యురాలు వారి కుమార్తె వివాహ విషయం మాట్లాడేందుకు సైకిల్‌పై మర్రిమిట్టకు వెళ్తుండగా మర్రిమిట్ట సమీపంలో బొలెరో వాహనం వెనుకనుంచి సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య-పకృత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే వీరయ్య అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. పకృత పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఎంజీఎంలో వీరయ్య మృతి చెందగా మెరుగైన చికిత్స కోసం ప్రకృతను వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో వీరయ్య నేత్రాలను రామాయమ్మ ఇంటర్నేషనల్‌ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. వీరయ్య కుమార్తె అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు. 




Updated Date - 2021-03-01T06:47:15+05:30 IST