ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 11 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-10T18:12:44+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,844 మందికి పరీక్షలు నిర్వహించగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
ఖమ్మం/కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,844 మందికి పరీక్షలు నిర్వహించగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1,038మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో శనివారం ఎవ్వరూ చేరలేదు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 20మంది చికిత్స పొందుతున్నారు. 300 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.