రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-04-18T06:33:55+05:30 IST

మండలంలోని జవనడుకు గ్రామ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకుని ఇద్దరు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

గుడిబండ, ఏప్రిల్‌ 17: మండలంలోని జవనడుకు గ్రామ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకుని ఇద్దరు గాయపడ్డారు. గ్రామస్థులు అందించిన వివరాల మేరకు మండలంలోని మైనగానపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప అనే వ్యక్తి గుడిబండ తహసీల్దార్‌ కార్యాలయంలో పనుల నిమిత్తం వచ్చి స్వగ్రామానికి  తిరిగి వెళ్తున్న సమయంలో గుడిబండ సహకార సంఘంలో పనిచేస్తున్న జవనడుకు శివన్న  ఇద్దరి ద్విచక్రవాహనాలు ఢీకున్నాయి. గోపాలప్పకు కాలువిరిగింది. శివన్నకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2021-04-18T06:33:55+05:30 IST