ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-01-17T06:08:35+05:30 IST
కేవీపల్లె మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఇద్దరు కడప జిల్లా వాసుల దుర్మరణం
కేవీపల్లె, జనవరి 16: కేవీపల్లె మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సుండుపల్లె మండలం జీకే రాసుపల్లెకు చెందిన సుబ్బారెడ్డి(78) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో చిత్తూరు జిల్లా కలికిరి మండలం మహల్లోని ఆస్పత్రిలో మందులు తెచ్చుకునేందు కోసం అదేగ్రామానికి చెందిన రెడ్డిశేఖర్(40)ను వెంటబెట్టుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరారు.కేవీపల్లె మండలం కమ్మపేట వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో రెడ్డిశేఖర్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సుబ్బారెడ్డి ఎగిరి కారు బానెట్పై పడ్డాడు. అతడిని కారు సుమారు వంద మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లడంతో సుబ్బారెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ రామ్మోహన్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.