రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-11-14T03:07:51+05:30 IST
జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
సూర్యాపేట: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కోదాడ గుడిబండ ఫ్లైఓవర్ దగ్గర వెనుక నుంచి బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.