Yadadri: విద్యుత్ షాక్తో ఇద్దరు కూలీలు మృతి
ABN , First Publish Date - 2022-07-14T20:28:46+05:30 IST
జిల్లాలోని నారాయణపూర్ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది.
యాదాద్రి: జిల్లాలోని నారాయణపూర్ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు కూలీలు మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద కరెంట్ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన అనిల్ (21), ప్రశాంత్ (17)గా గుర్తించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా, విద్యుత్ సరఫరా నిలిపివేయక పోవడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం.