మండలంలో ఇద్దరు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-03T05:29:39+05:30 IST
మండలంలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్ఐ కొరేడి రాజు తెలిపారు.
బావిలో పడి ఒకరి మృతి
రామారెడ్డి, డిసెంబరు 2: మండలంలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్ఐ కొరేడి రాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం గిద్ద గ్రామానికి చెందిన సింగాని ప్రతాప్రెడ్డి (50) అనే వ్యక్తి బావిలో నుంచి కేబుల్ వైరు బయటకు తీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడన్నారు. పోసానిపేట గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దడ్ల రవి (30) అనే యువకుడు జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన గాండ్ల లక్ష్మి (60) అనే వృద్ధురాలు కడుపు నొప్పి భరించలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.