Delhi: ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన దుండగులు.. వారు ఆ హత్య ఎందుకు చేశారో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2022-10-03T02:52:03+05:30 IST

అక్షరాస్యత భారీగా పెరిగి, సమాజం ఇంతగా అభివృద్ధి చెందిన దశలో కూడా ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే పట్టుకుని వేలాడుతున్నారు.

Delhi: ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపిన దుండగులు.. వారు ఆ హత్య ఎందుకు చేశారో తెలిస్తే షాకవడం ఖాయం!

అక్షరాస్యత భారీగా పెరిగి, సమాజం ఇంతగా అభివృద్ధి చెందిన దశలో కూడా ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే పట్టుకుని వేలాడుతున్నారు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ తిరోగమనంలో ప్రయాణిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులు అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని హత్య చేశారు. వారు ఆ హత్య ఎందుకు చేశారో తెలుసుకుంటే మాత్రం షాకవడం ఖాయం. దేవుడు తమకు కలలో కనిపించి ఆరేళ్ల బాలుడిని చంపాలని చెప్పాడని, అందుకే తాము ఆ హత్య చేశామని వారు చెప్పడం పోలీసులకు షాకిచ్చింది. పోలీసులు నిందితులిద్దరినీ ఆరెస్ట్ చేశారు. 


ఇది కూడా చదవండి..

Weight loss: 161 కేజీల బరువున్న ఈ వ్యక్తి ఏడాది తిరిగేసరికి ఇలా.. ఎన్ని కిలోలు తగ్గాడో.. ఇప్పుడెంత బరువున్నాడో తెలిస్తే..


నిందితులిద్దరూ బీహార్‌కు చెందిన విజయ్‌కుమార్‌, అమర్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వారిద్దరికీ ఆ చిన్నారితో గాని, ఆ చిన్నారి కుటుంబ సభ్యులతో గాని ఎలాంటి శత్రుత్వమూ లేదు. దేవుడు తమకు కలలో కనిపించి ఆరేళ్ల బాలుడిని నరికి చంపితే, మీకు మంచి జరుగుతుందని చెప్పాడని, దేవుని ఆజ్ఞను అనుసరించి బాలుడి కోసం వెతకగా.. తమకు ఆ బాలుడు కనిపించాడని, వెంటనే అతడిని గొంతు కోసి చంపేసినట్లు నిందితులు చెప్పారు. 


చిన్నారి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఘటనా సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-10-03T02:52:03+05:30 IST