రిక్షా చోరీ... ముగ్గురిని స్తంభానికి కట్టేసి...

ABN , First Publish Date - 2021-02-23T13:54:48+05:30 IST

రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణంలో రిక్షా చోరీ చేశారని ఆరోపిస్తూ...

రిక్షా చోరీ... ముగ్గురిని స్తంభానికి కట్టేసి...

అల్వర్: రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణంలో రిక్షా చోరీ చేశారని ఆరోపిస్తూ ఒక మహిళతో పాటు ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి, వారిపై దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. శ్యోలాల్‌పూర్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ మహిళపై కూడా స్థానికులు దాడి చేశారు. ఇటీవల వీరు మూడు రిక్షాలను చోరీ చేశారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులే వారిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. తరువాత వారిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను విడిపించారు. దాడికి దిగిన నలుగురు వ్యక్తులను అదుపుతోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీసులు రిక్షా దొంగలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా రిక్షా యజమాని చున్నీలాల్ మాట్లాడుతూ తన మూడు రిక్షాలు చోరీకి గురయ్యాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని ఆరోపించారు. 

Updated Date - 2021-02-23T13:54:48+05:30 IST