park గుంతలో పడి ఇద్దరు పిల్లల దుర్మరణం..కాంట్రాక్టర్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-26T12:50:52+05:30 IST
ఓ పార్కులో గుంతలో పడి ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది...
ముంబై : ఓ పార్కులో గుంతలో పడి ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతంలోని పార్క్ వద్ద తవ్విన బహిరంగ గొయ్యిలో పడి ఇద్దరు పిల్లలు మరణించారు.యష్కుమార్ చంద్రవంశీ (12), శివమ్ జైస్వాల్ (9) అనే ఇద్దరు పిల్లలు సెక్టార్ 7లోని పార్కులో బహిరంగ గొయ్యిలో పడిపోయారు.వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్కులోని నీటిపైపును మరమ్మతు చేయడానికి తవ్వడంతో ఆ గుంతలో పడి పిల్లలు దుర్మరణం చెందారు. దీంతో ఈ కేసులో నిందితుడైన కాంట్రాక్టరును పోలీసులు అరెస్టు చేశారు.పిల్లల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.