రెండు మోటారు బైకులు ఢీ... ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-18T05:49:40+05:30 IST

మండల పరిధిలోని బయనపల్లె గ్రామ సమీపంలో రెండు మోటారు బైకులు ఢీకొన్న ఘటనలో వెంకట శేషయ్య (44) అనే వ్యక్తి మృతి చెందాడు.

రెండు మోటారు బైకులు ఢీ... ఒకరి మృతి

బద్వేలు రూరల్‌, అక్టోబరు 17: మండల పరిధిలోని బయనపల్లె గ్రామ సమీపంలో రెండు మోటారు బైకులు ఢీకొన్న ఘటనలో వెంకట శేషయ్య (44) అనే వ్యక్తి మృతి చెందాడు. రూర ల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు... మన్నెంవారిపల్లె బీసీ కాలనీకి చెందిన వెంకట శేషయ్య సిద్దవటం రోడ్డు నుంచి మోటార్‌బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో తిప్పనపల్లెకు చెందిన విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి పట్టణం నుంచి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో రెం డు మోటార్‌ బైకులు ఢీకొన్నాయి. దీంతో ఘటనా స్థలంలోనే వెంకటశేషయ్య మృతి చెందాడు. విజయ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యా యి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు సంతానం. వెంకటశేషయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రమాద ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-10-18T05:49:40+05:30 IST