Chhattisgarh: ఇద్దరు నక్సలైట్ల ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2021-08-24T16:27:29+05:30 IST

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా ప్రాంతంలో మంగళవారం నక్సలైట్లకు, సాయుధ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి....

Chhattisgarh: ఇద్దరు నక్సలైట్ల ఎన్‌కౌంటర్

సుక్మా (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా ప్రాంతంలో మంగళవారం నక్సలైట్లకు, సాయుధ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలోని గోంపాద్ అటవీప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం మేర సాయుధ పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. అటవీప్రాంతంలో ఉన్న నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. సంఘటన స్థలంలో తుపాకులు, మందుగుండుసామాగ్రి, తూటాలను స్వాధీనం చేసుకున్నామని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ చెప్పారు. నక్సలైట్లున్న అటవీ ప్రాంతం నుంచి మరికొందరు నక్సలైట్లు పారిపోయారని వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. మరణించిన వారిలో ఓ నక్సలైట్ కవాసీ హుంగా కుంట ఏరియా దళ కమాండర్ అని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-08-24T16:27:29+05:30 IST