రెండు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభం
ABN , First Publish Date - 2022-10-07T05:19:09+05:30 IST
రాజంపేట తిరుపతి మధ్య రెండు నూతన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ నూతన బస్సుల వల్ల తిరుపతి, రాజంపేట, కోడూరుల మధ్య రాకపోకలు సులభమవుతాయన్నారు.
రాజంపేట, అక్టోబరు 6: రాజంపేట తిరుపతి మధ్య రెండు నూతన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ నూతన బస్సుల వల్ల తిరుపతి, రాజంపేట, కోడూరుల మధ్య రాకపోకలు సులభమవుతాయన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో నుంచి పాతబస్టాండు వరకు ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ రమణయ్య, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.