జిల్లాలో మరో రెండు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-06T10:42:45+05:30 IST

జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జిల్లాలో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు

జిల్లాలో మరో రెండు కరోనా కేసులు

సుభాష్‌నగర్‌, జూలై 5: జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా జిల్లాలో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 147 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని పద్మశాలి వీధికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అతని నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. నగరంలోని వావిలాలపల్లికి చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. 


కొనసాగుతున్నస్ర్కీనింగ్‌ 

హుజూరాబాద్‌ రూరల్‌: కరోనా సోకిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది స్ర్కీనింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌రెడ్డి తెలిపారు. హుజూరాబాద్‌ కాకతీయ కాలనీ, సాయిబాబా ఆలయం, చాకలి వాడలో 280మందికి, హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామంలో 202, జమ్మికుంట మండలం ధర్మారం, వావిలాల, కొత్తపల్లిలలో 521 మందికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-06T10:42:45+05:30 IST