కరోనాతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-04-17T06:12:52+05:30 IST

కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మదనపల్లె పట్టణం శివాజీనగర్‌, మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని మృతి చెందారు.

కరోనాతో ఇద్దరి మృతి

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 16: కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మదనపల్లె పట్టణం శివాజీనగర్‌కు చెందిన దం పతులకు ఐదురోజుల కిందట కొవిడ్‌ పరీక్ష నిర్వహిం చగా వ్యాధి నిర్ధరణ అయ్యింది. ఈక్రమంలో కుటుంబ సభ్యులు బాధితులను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రిలో చేర్పించారు. కాగా శుక్రవారం భర్త పరిస్థితి విష మంగా మారడంతో జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు. స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన విద్యార్థిని మూడు రోజు లుగా జ్వరంతో బాధపడుతోంది. శుక్రవారం జిల్లా వైద్య శాలలో కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధరణ అ య్యింది. అనంతరం చికిత్సలు ప్రారంభించగా పరిస్థితి విషమించి మృతి చెందింది.

Updated Date - 2021-04-17T06:12:52+05:30 IST