వేర్వేరు చోట్ల రైలు కింద పడి ఇరువురి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-07T05:21:17+05:30 IST
కడప-భాకరాపేట రైల్వేస్టేషన్ మధ్య కడపకు చెందిన గంపా జయచంద్ర (32) రైలు కింద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కడప (క్రైం), మార్చి 6 : కడప-భాకరాపేట రైల్వేస్టేషన్ మధ్య కడపకు చెందిన గంపా జయచంద్ర (32) రైలు కింద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే కడప-కృష్ణాపురం రైల్వేస్టేషన్ మధ్య వంగపూరి శ్రీను (38) ఆత్మహత్యకు పాల్పడినట్లు కడప రైల్వే ఎస్ఐ వర్మ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. కడప నగరం చిన్నచౌకు ప్రాంతానికి చెందిన గంపా జయచంద్ర కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో మద్యానికి అలవాటుపడ్డాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేిసినట్లు తెలిపారు. అలాగే అక్కాయపల్లెలోని అరుంధతీనగర్కు చెందిన శ్రీనివాసులు కడప-క్రిష్ణాపురం రైల్వేస్టేషన్ మధ్య రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.