రెండు మొక్కలు నాటాకే వివాహ ధ్రువీకరణపత్రం
ABN , First Publish Date - 2022-06-29T06:12:36+05:30 IST
రెండు మొక్కలు నాటాకే వివాహ ధ్రువీకరణపత్రం
- కడ్తాలలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
కడ్తాల్, జూన్ 28: కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ పరిధిలో వివాహం చేసుకొని వివాహ ధ్రువీకరణ పత్రం పొందే వారంతా విధిగా రెండు మొక్కలు నాటాలని కార్యాచరణ రూపొందించి మంగళవారం ప్రారంభించారు. ధ్రువీకరణ పత్రం పొందిన మండల కేంద్రానికి చెందిన ఎర్రమాల మానస నర్సింహ దంపతులు ఈక్రమంలో పల్లెప్రకృతి వనంలో రెండు మొక్కలు నాటిన అనంతరం సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, సిబ్బంది రాజు, కుమార్, మహేశ్, శ్రీలత పాల్గొన్నారు.