రెండు లారీల్లో బొండు ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-01-23T05:40:17+05:30 IST

గోదావరి తీర ప్రాంతంలో మల్లేశ్వరం వద్ద ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా బొండు ఇసుక తరలిస్తున్న రెండు లారీలను శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

రెండు లారీల్లో బొండు ఇసుక అక్రమ రవాణా
బొండు ఇసుక లారీలను నిలిపిన జనసేన పార్టీ కార్యకర్తలు

మల్లేశ్వరం వద్ద అడ్డుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు 

పెరవలి,  జనవరి21: గోదావరి తీర ప్రాంతంలో మల్లేశ్వరం వద్ద ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా బొండు ఇసుక తరలిస్తున్న రెండు లారీలను  శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి ప్రతీ రోజూ ఇళ్ల స్థలాల్లో పూడిక నిమిత్తం ఇతర ప్రాంతాలకు అక్రమంగా అనేక లారీల్లో తరలించుకుపోతున్నారని మండల పరిషత్‌  మాజీ అధ్యక్షుడు కోటిపల్లి మురళీకృష్ణ ఆరోపించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలిపామన్నారు. ప్రతీరోజూ ఇళ్ల స్థలాల పూడిక పేరుతో లారీలకు లారీలు బయటకుతరలిపోతున్నా రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు

Updated Date - 2022-01-23T05:40:17+05:30 IST