మాస్క్ పెట్టుకోమన్న గార్డు... కత్తితో 27సార్లు పొడిచిన అక్కాచెల్లెళ్లు!

ABN , First Publish Date - 2020-10-29T13:47:06+05:30 IST

అమెరికాలోని చికాగో నగరంలో దారుణం జరిగింది. ఈ ప్రాంతానికి...

మాస్క్ పెట్టుకోమన్న గార్డు... కత్తితో 27సార్లు పొడిచిన అక్కాచెల్లెళ్లు!

చికాగో: అమెరికాలోని చికాగో నగరంలో దారుణం జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒక సెక్యూరిటీ గార్డును అత్యంత దారుణంగా 27 సార్లు పొడిచారు. ఆ సెక్యూరిటీ గార్డు ఈ అక్కాచెల్లెళ్లకు మాస్క్ పెట్టుకోవాలని చెప్పాడు. వెంటనే వారు ఆగ్రహంతో ఊగిపోతూ తమ దగ్గరున్న పదునైన కత్తితో ఆ గార్డును గాయపరిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాళ్లను జెస్సికా, జైలాగా గుర్తించారు. వీరిని వెంటనే అరెస్టు చేశారు. గాయపడిన సెక్యూరిటీ గార్డుకు చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. బాధితుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిందితులు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. 


Updated Date - 2020-10-29T13:47:06+05:30 IST