ప్రాణంమీదకు తెచ్చిన సెల్ఫీ

ABN , First Publish Date - 2021-03-01T09:28:55+05:30 IST

సెల్ఫీ సరదా ప్రాణంమీదకు తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు-పిఠాపురం మధ్య ఉన్న ఏలేరు (గొర్రిఖండి) కాల్వ వద్దకు పిఠాపురంలో

ప్రాణంమీదకు తెచ్చిన సెల్ఫీ

కాల్వలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ఒకరి మృతదేహం లభ్యం


 గొల్లప్రోలు, ఫిబ్రవరి 28: సెల్ఫీ సరదా ప్రాణంమీదకు తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు-పిఠాపురం మధ్య ఉన్న ఏలేరు (గొర్రిఖండి) కాల్వ వద్దకు పిఠాపురంలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం వెళ్లారు. ఫొటోలు తీసుకునేందుకు వారు రక్షణ గోడ వద్దకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా వేణుం తేజ(16) కాల్వలో పడిపోయాడు. అతనిని రక్షించేందుకు కొండ మహంతి వాసు (16) కాల్వలోకి దిగాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. వేణుం తేజ మృతదేహం లభ్యం కాగా వాసు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-03-01T09:28:55+05:30 IST