Manginapoodi బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థినిలు మృతి

ABN , First Publish Date - 2022-05-23T17:18:04+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినిలు గల్లంతయ్యారు.

Manginapoodi బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థినిలు మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినిలు గల్లంతయ్యారు. భీమవరం విష్ణు కాలేజ్‌లో బి.ఫార్మసీ చదువుతున్న కాకర ప్రమీల (22), కళ్ళేపల్లి పూజిత (22) బీచ్‌లో గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు... విద్యార్థినిలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. కాగా... ఒడ్డుకు చేరిన 20 నిమిషాల్లోనే విద్యార్థినిలు మృతి చెందారు. విషయం తెలిసిన బందరు తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-05-23T17:18:04+05:30 IST