రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
ABN , First Publish Date - 2021-11-25T02:16:19+05:30 IST
వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు
రంగారెడ్డి: వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్లో బైక్ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. బైక్పై ఉన్నఇద్దరూ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు రోహిత్రెడ్డి, విశాల్గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.