వైసీపీ నుంచి ఇద్దరి సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-03-01T05:59:54+05:30 IST
పంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్గా పోటీచేసిన మాజీ సర్పంచ్ సుంకర సత్యారావు(గాంధీ) పాతాళ శ్రీనులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు కొల్లిమళ్ళ అచ్చెంనాయుడు ఆదివారం ప్రకటించారు.
బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 28: పంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్గా పోటీచేసిన మాజీ సర్పంచ్ సుంకర సత్యారావు(గాంధీ) పాతాళ శ్రీనులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు కొల్లిమళ్ళ అచ్చెంనాయుడు ఆదివారం ప్రకటించారు. బుచ్చెయ్యపేటలో పార్టీ మద్దతుదారుడు ఓడిపోవడానికి సత్యారావు, శ్రీనులే కారణమని కార్యకర్తలు తగిన సాక్ష్యాధారాలతో చోడవరం ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ, మండల పార్టీ అధ్యక్షుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఇద్దరికీ మూడు వారాల కిందట షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు.