పోలీసుల అదుపులో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు?

ABN , First Publish Date - 2021-02-27T01:28:13+05:30 IST

టీడీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులను

పోలీసుల అదుపులో ఇద్దరు  టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు?

పశ్చిమ గోదావరి: టీడీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వీరు పోటీ చేస్తున్నారు. ఏలూరు నగరంలోని 6వ డివిజన్ అభ్యర్థిగా మాకాల రమేష్, 19వ డివిజన్ అభ్యర్థిగా పైడా వెంకట్రావులు టీడీపీ తరపున నామినేషన్ వేశారు. ఎటువంటి కారణాలు తెలుపకుండానే రమేష్, వెంకట్రావులను రూరల్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే నామినేషన్లు విత్‌ డ్రా చేయించడానికే అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది.

Updated Date - 2021-02-27T01:28:13+05:30 IST