నెల్లూరులో ఇద్దరు టీడీపీ నేతల సస్పెండ్

ABN , First Publish Date - 2021-12-12T02:00:11+05:30 IST

ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన నెల్లూరుకి చెందిన

నెల్లూరులో ఇద్దరు టీడీపీ నేతల సస్పెండ్

నెల్లూరు: ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన నెల్లూరుకి చెందిన ఇద్దరు నేతలను పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేశారు. నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష ముగిసింది. మున్సిపల్ ఎన్నికలలో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దుచేశారు. త్వరలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. నగర నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు పని తీరు మార్చుకోక పోతే కఠిన నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-12T02:00:11+05:30 IST