Telugu రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం
ABN , First Publish Date - 2021-11-26T14:22:12+05:30 IST
తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్ర నుంచి వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ సరిహద్దు వద్ద టోల్గేట్ దగ్గర ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు.
కర్నూలు: తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్ర నుంచి వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ సరిహద్దు టోల్గేట్ దగ్గర ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉన్నట్టుండి తెలంగాణ ప్రభుత్వ అనధికారిక ఆదేశాలతో ఆంధ్ర వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఆదేశాలతో ఆంధ్ర రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు భయపడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులకు దాన్యం నిలువ కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్ర ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.