రెండు ద్విచక్ర వాహనాల ఢీ
ABN , First Publish Date - 2022-07-01T06:38:20+05:30 IST
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన రెంజల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం సాటాపూర్కు చెందిన ఇ.శంకర్ (35) తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదే క్రమంలో నవీపేట్కు చెందిన మహ్మద్ నవీద్ (20) సాటాపూర్ నుంచి నవీపేట్ వెళ్లే దారిలో ఇద్దరు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి ఎస్సై సాయన్న చేరుకుని గాయాలైన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రెంజల్, జూన్ 30: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన రెంజల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం సాటాపూర్కు చెందిన ఇ.శంకర్ (35) తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదే క్రమంలో నవీపేట్కు చెందిన మహ్మద్ నవీద్ (20) సాటాపూర్ నుంచి నవీపేట్ వెళ్లే దారిలో ఇద్దరు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి ఎస్సై సాయన్న చేరుకుని గాయాలైన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.