ఏటీఎం సెంటర్లోకి వెళ్లి ఆ ఇద్దరు మహిళలు చేసిన నిర్వాకమిది.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం.. చివరకు..
ABN , First Publish Date - 2021-07-27T21:38:04+05:30 IST
ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా ప్రవర్తించారు..
ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా ప్రవర్తించారు.. ఓ మెషిన్తో ఏటీఎంలను హ్యాక్ చేసి డబ్బులు తీసేందుకు ప్రయత్నించారు.. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు.. కానీ, ఎటీఎం సెంటర్లో వారు చేసిన పని సీసీటీవీలో రికార్డు అయింది.. దానిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.. రాజస్థాన్లోని జైపూర్లో ఆ ఘటన జరిగింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన ఇద్దరు విదేశీ మహిళలు ఏటీఎంలను హ్యాక్ చేసి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోయినా వారు చేసిన పని సీసీటీవీలో రికార్డు అయింది. దానిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళలిద్దరూ ఉగండాలోని జాంబియాకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, రాజస్థాన్లోని కోటా ప్రాంతంలోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏటీఎంను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొట్టిన కేసులు కోటాలో నమోదయ్యాయి. దీంతో కోటా పోలీసులు కూడా వీరిని విచారించనున్నారు.