ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళల మృతి
ABN , First Publish Date - 2021-11-28T06:27:10+05:30 IST
కె.నాగలాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని నెరవాడ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు.
గూడూరు, నవంబరు 27: కె.నాగలాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని నెరవాడ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఎస్ఐ ప్రేమ వివరాల మేరకు.. కల్లూరు మండలం నెరవాడ గ్రామానికి చెందిన సోమక్క(65), గోకులపాడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ(57) పొలం పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. నెరవాడ వద్ద రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్డింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.