దోసలవాగులో ఇద్దరు యువతులు గల్లంతు
ABN , First Publish Date - 2021-08-31T01:57:15+05:30 IST
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజపేట మండలం
యాదాద్రి-భువనగిరి : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసలవాగులో ఇద్దరు యువతులు సింధూజ( 24), బిందు (14) గల్లంతయ్యారు. ఇటుకాలపల్లి వెళ్లి తిరిగి శ్రవణ్ అనే వ్యక్తి బైక్పై కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి యువతులు కొట్టుకుపోయారు. శ్రవణ్ను స్థానికులు కాపాడారు. గాలింపు చర్యల్లో కొన ఊపిరితో సింధూజ దొరికింది. చికిత్స కోసం రాజపేట నుంచి భువనగిరి ఆసుపత్రికి తరలించారు. బిందు ఆచూకీ ఇంకా లభించ లేదు.