రాష్ట్రంలో దౌర్జన్య పాలన

ABN , First Publish Date - 2021-10-24T06:09:19+05:30 IST

రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగు తోందని టీడీపీ శింగనమల నియోజ కవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆ లం నరసానాయుడు, ముంటిమడు గు కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ రా మలింగారెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో దౌర్జన్య పాలన
మాట్లాడుతున్న ఆలం నరసానా యుడు, కేశవరెడ్డి, రామలింగారెడ్డి

పచ్చని పొలాన్ని దున్నడం అన్యాయం : ద్విసభ్య కమిటీ సభ్యులు

బుక్కరాయసముద్రం, అక్టోబరు23: రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగు తోందని టీడీపీ శింగనమల నియోజ కవర్గ  ద్విసభ్య కమిటీ సభ్యులు ఆ లం నరసానాయుడు, ముంటిమడు గు కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ రా మలింగారెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని కొర్రపాడు గ్రామం వద్ద రైతు నరసింహారెడ్డికి చెందిన పచ్చని వరిపైరులో దౌర్జన్యంగా రహదారి వేసిన ఘటనను టీ డీపీ నేతలు ఖండించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేయడం బెదరించడం జరుగుతోందన్నారు. మాది రైతు ప్రభుత్వం అని చెబుతున్న వైసీపీ నాయకులు రైతులపైనే దాడులు చేసి ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారన్నారు. పచ్చని పొలంలో వైసీపీ నేతల ప్రోత్సాహంతో అధికారులు దున్నివేయడం తీవ్ర అన్యాయమన్నారు. నిజంగా రస్తా ఉంటే... పంట పూర్తి అయిన అనంతరం వేయాలన్నారు. వెంటనే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చోరవ చూపి రైతు నష్టపోకుండా నష్టపరిహారం అందించేలా  చూడలన్నారు. లేకపోతే అందోళన చేపడుతామని హెచ్చరించారు. 


Updated Date - 2021-10-24T06:09:19+05:30 IST