కరోనా ఎఫెక్ట్.. యూఏఈ కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2021-01-22T05:13:18+05:30 IST
ప్రపంచ దేశాల్లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. యూఏఈలో కూడా ఈ మహమ్మారి అలజడి సృ
అబుధాబి: ప్రపంచ దేశాల్లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. యూఏఈలో కూడా ఈ మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం ఫైజర్, సినోఫార్మ్ టీకాలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన యూఏఈ.. తాజాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ V వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజువారి కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ V వ్యాక్సిన్కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. గురువారం ఒక్కరోజే యూఏఈలో 3,500పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2.63లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 762కు చేరింది.