యూఏఈలో నాలుగు మిలియ‌న్లకు పైగా కోవిడ్ టెస్టులు...

ABN , First Publish Date - 2020-07-14T15:17:14+05:30 IST

ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు గ‌ల్ఫ్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.

యూఏఈలో నాలుగు మిలియ‌న్లకు పైగా కోవిడ్ టెస్టులు...

యూఏఈ: ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు గ‌ల్ఫ్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, కువైట్‌, ఖ‌తార్‌, సౌదీ అరేబియాలో కోవిడ్‌-19 క‌ల్లోలం సృష్టిస్తోంది. కాగా, యూఏఈలో క‌రోనా ప్ర‌భావం గ‌త కొన్ని రోజులుగా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం కాస్తా ఊర‌ట‌నిచ్చే విష‌యం. దీనికి కార‌ణం దేశ‌వ్యాప్తంగా ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌డ‌మే. ఇప్ప‌టికే నాలుగు మిలియ‌న్లకు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది. ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు ఆరు మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. 


ఇక సోమ‌వారం నిర్వ‌హించిన 34,478 టెస్టుల్లో 344 కేసులు పాజిటివ్‌గా వ‌చ్చాయని, దీంతో యూఈఏ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 55,198 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌తినిధి డా. ద‌హాక్‌ తెలియ‌జేశారు. మ‌రో 373 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రిక‌వ‌రీలు 45,513కు చేరాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 9,351 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్ప‌టికే 334 మందిని ఈ మ‌హ‌మ్మారి క‌బ‌ళించింది.    

Updated Date - 2020-07-14T15:17:14+05:30 IST