తప్పనిసరి మాస్కు నిబంధన తొలగించిన యూఏఈ

ABN , First Publish Date - 2022-02-28T01:24:33+05:30 IST

యూఏఈలో కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కరోనా ఆంక్షలను మరింతగా సడలించింది.

తప్పనిసరి మాస్కు నిబంధన తొలగించిన యూఏఈ

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈలో కరోనా సంక్షోభం నెమ్మదిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కరోనా ఆంక్షలను మరింతగా సడలించింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధనను తాజాగా తొలగించింది. అంతేకాకుండా.. కరోనా పేషెంట్లకు సన్నిహితంగా మెలిగిన వాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలన్న రూల్‌ను కూడా రద్దు చేసింది. తాజాగా మార్గదర్శకాల ప్రకారం.. కరోనా టీకా తీసుకున్న వారు ఇకపై ఆర్‌టీపీసీఆర్ పరీక్ష రిపోర్టులు లేకుండానే నేరుగా దేశంలోకి ప్రవేశించవచ్చు. శనివారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాగా.. జనవరిలో దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 వేలకు తాకింది. ప్రస్తుతం సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

Updated Date - 2022-02-28T01:24:33+05:30 IST