భారత విమానాలపై నిషేధం పొడిగించిన యూఏఈ

ABN , First Publish Date - 2021-07-27T05:51:48+05:30 IST

భారతదేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ

భారత విమానాలపై నిషేధం పొడిగించిన యూఏఈ

అబుధాబి: భారతదేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటన చేసింది. ఈ నిషేధాన్ని మరోసారి పొడిగించే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఆ నిర్ణయం అధికారుల చేతుల్లో ఉందని ఎయిర్‌వేస్ తెలిపింది. ప్రస్తుతానికి భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆగస్టు 2 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కెనడా కూడా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 21 వరకు భారత్ నుంచి వచ్చే విమానాలను బ్యాన్ చేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. భారత్‌లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా వేరియంట్ భయంతో పలుదేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-07-27T05:51:48+05:30 IST