యూఏఈలో అంతకంతకు పెరుగుతున్న రికవరీలు !
ABN , First Publish Date - 2020-08-08T17:07:07+05:30 IST
మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటున్న యూఏఈలో రికవరీలు అంతకంతకు పెరుగుతున్నాయి.
యూఏఈ: మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటున్న యూఏఈలో రికవరీలు అంతకంతకు పెరుగుతున్నాయి. క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గి... కోలుకుంటున్న వారు పెరుగుతుండటంతో రికవరీ రేటు 90 శాతం దాటిందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 216 కొత్త కేసులు నమోదైతే... 276 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 62,061కు చేరితే... మొత్తం రికవరీలు 56,015 అయ్యాయి. ఇక నిన్న సంభవించిన రెండు మరణాలతో కలిపి ఇప్పటికే 356 మందిని ఈ వైరస్ కబళించింది. ప్రస్తుతం దేశంలో 5,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు కరోనా వ్యాప్తి కట్టడి కోసం యూఏఈ ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 61,978 కోవిడ్ టెస్టులు చేసిన ఆరోగ్యశాఖ ఇప్పటివరకు ఐదు మిలియన్లకు పైగా పరీక్షలు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కోవిడ్ ఇప్పటికే 7.24 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. కోటి 95 లక్షల మందికి ప్రబలింది.