యూఏఈ కీలక నిర్ణయం... భారత విమానాలపై నిషేధం

ABN , First Publish Date - 2021-04-23T02:00:51+05:30 IST

భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

యూఏఈ కీలక నిర్ణయం... భారత విమానాలపై నిషేధం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలనూ పది రోజులపాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్‌లో నేడు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ పురుడుపోసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏ దేశంలోనూ ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, గత 14 రోజుల్లో భారతదేశం మీదుగా ప్రయాణించిన వారు మరే ఇతర దేశాల నుంచి కూడా యూఏఈలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-04-23T02:00:51+05:30 IST